కరోనాతో కన్నుమూసిన నర్సు.. చివరిగా భర్తతో ఏం చెప్పిందంటే.

యూరోప్‌లో ప్రధాన దేశమైన బ్రిటన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ కరోనా మృతుల 4వేలు దాటిందంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 41,903కి చేరింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోతే కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా కారణంగా సాధారణ ప్రజలతో పాటు వైద్య సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవడం కలవరం రేపుతోంది. తాజాగా నస్రీన్ అనే నర్సు(38) కరోనా బారిన పడి చనిపోయింది. చనిపోయే ముందు భర్త ఆమె పక్కనే ఉన్నారు. చివరిగా ఆమె భర్తతో చెప్పిన మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.


బ్రిటన్‌లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌కు చెందిన అరీమా నస్రీన్ వాల్‌సన్ మ్యానర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఆమె ఎప్పటి నుంచో అక్కడే హౌస్‌కీపర్, హెల్త్ కీపర్‌గా ఏళ్లపాటు పనిచేస్తూ తపనతో నర్సింగ్ కోర్సు పూర్తిచేసింది. గతేడాదే నర్సుగా అదే ఆస్పత్రిలో విధుల్లో చేరింది. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలున్నారు. ఇటీవల బ్రిటన్‌లో విలయ తాండవం చేస్తుండటంతో నస్రీన్ రోగుల సేవలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే ఆమె కూడా కరోనా బారిన పడింది. తాను రోగులకు సేవ చేసిన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. ఇటీవల ఆమె పరిస్థితి విషమించడంతో డాక్టర్లు బ్రతకడం కష్టమని చెప్పేశారు.